డోర్నకల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట

డోర్నకల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట

డోర్నకల్, వెలుగు : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్  గాంధీ సెంటర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది.  కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తుండగా అటువైపు వెళ్లకుండా వంద మీటర్ల  దూరంలోని వేరే మార్గం ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు.  

పట్టించుకోకుండా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్  తన కార్యకర్తలతో కలిసి గాంధీ సెంటర్ వైపు ర్యాలీగా వెళ్లడంతో కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలకు స్థానిక సీఐ రాజేశ్​ నచ్చజెప్పి ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.